భారతదేశం, ఆగస్టు 30 -- వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ. 27 కోట్ల వ్యయంతో జరుగుతున్న ఆధునీకరణ, పునర్నిర్మాణ పనుల పురోగతిని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. తెలంగాణ వ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరచేందుకు, ఆధునీకరించేందుకు భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా వికారాబాద్ స్టేషన్ రూపురేఖలు వేగంగా మారుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మొత్తం 40 రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో పునర్అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా వికారాబాద్, తాండూరు, నాంపల్లి, సికింద్రాబాద్, మౌలాలి, చర్లపల్లి వంటి ప్రధాన రైల్వే స్టేషన్లు సరికొత్త హంగులతో సిద్ధమవుతున్నాయి.

వికారాబాద్ పట్టణం, దాని పరిసర ప్రాంతాల వేగవంతమైన ఎదుగుదలను, ప్రయాణికుల అవసరాలను దృష్టి...