భారతదేశం, సెప్టెంబర్ 8 -- తెలంగాణలో 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ, అప్‌గ్రేడేషన్, వాణిజ్యపరమైన నిర్వహణకు సంబంధించిన ప్రీ-బిడ్ సమావేశాలు జరిగాయి. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల వద్ద విద్యుత్ వినియోగం పరంగా దేశంలోనే రాష్ట్రం నాలుగో స్థానంలో ఉండటం, ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో, మౌలిక సదుపాయాల ఏర్పాటు లేదా నిర్వహణ అత్యంత కీలకంగా మారింది.

తెలంగాణలో ఈవీల వాడకం పెంచేందుకు TGREDCO చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు చూస్తోంది. మొత్తం 369 ఛార్జింగ్ స్టేషన్లలో 200 స్టేషన్లు గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఉంటాయి. మిగిలిన 169 స్టేషన్లు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఉన్నాయి. ఛార్జింగ్ కోసం ధరను యూనిట్‌కు రూ.13 (అద...