భారతదేశం, జూలై 7 -- అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో సహాయపడగల శిక్షణ పొందిన స్వచ్ఛంద కార్యకర్తల బృందాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ అగ్నిమాపక, విపత్తు ప్రతిస్పందన, అత్యవసర, పౌర రక్షణ శాఖ రెండు విశ్వవిద్యాలయాలలో పౌర రక్షణ స్వచ్ఛంద కార్యకర్తల శిక్షణా కార్యక్రమాలను(Civil Defence Volunteer Training Programmes) ప్రారంభించింది.

ఈ స్వచ్ఛంద కార్యకర్తలు సహాయక చర్యలు, అగ్నిమాపకం, ప్రథమ చికిత్స, జన సమూహ నిర్వహణ, విపత్తు సన్నద్ధత, సామాజిక అవగాహన, సహాయ పంపిణీ వంటి అంశాలలో సైద్ధాంతిక, ఆచరణాత్మక శిక్షణ పొందుతారు. అత్యవసర పరిస్థితులలో వీరు అగ్నిమాపక శాఖ, పోలీసులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, ఇతర శాఖలతో కలిసి పనిచేస్తారు.

దులాపల్లిలోని మల్లారెడ్డి డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. ఇం...