భారతదేశం, ఫిబ్రవరి 14 -- తెలంగాణకు కేంద్రం మరోసారి శుభవార్త చెప్పింది. కర్ణాటకలోని గూడె బేల్లూరు- తెలంగాణలోని మహబూబ్‌నగర్ మధ్య రూ. 3,175 కోట్ల ఖర్చుతో నాలుగు లైన్ల రోడ్డు విస్తరణకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు 80 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నాలుగు వరుసల ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం 3,175 కోట్ల రూపాయల వ్యయాన్ని కేటాయించారు.

హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా ఈ రోడ్డు నిర్మాణం జరగనుంది. రాయచూర్, రాయచూర్, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్ మీదుగా హైదరాబాద్‌కు ఉన్న ఈ కనెక్టివిటీ మెరుగుపడటం వల్ల ఈ ప్రాంతంలో ఆర్థికపరమైన రంగాలతో పాటు లాజిస్టిక్స్ రంగాలు గణనీయంగా వృద్ధి చెందే అవకాశం ఉంది.

ప్రస్తుతం గుడే బెల్లూర్ నుంచి మహబూబ్ నగర్ (జాతీయ రహదారి (NH 167 ) మధ్య ఉన్న కనెక్టివిటీ చాలా ఇబ్బందికరంగా ఉంది. పట్టణ ప్...