భారతదేశం, సెప్టెంబర్ 6 -- జ్యోతిషశాస్త్రంలో నవగ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడి సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహాల రాశుల మార్పు మానవ జీవితంపై, దేశ ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం తన సొంత రాశి అయిన సింహంలో సంచరిస్తున్న సూర్య భగవానుడు త్వరలోనే రాశి మారబోతున్నారు. సెప్టెంబర్ 17 వరకు సింహ రాశిలోనే ఉండనున్న సూర్యుడు, ఆ తర్వాత కన్యా రాశిలోకి ప్రవేశిస్తారు.

అక్కడ కొంతకాలం సంచరించిన అనంతరం అక్టోబర్ 17న రాత్రి 7:58 గంటలకు శుక్రుడి ఆధిపత్యం ఉన్న తులా రాశిలోకి అడుగుపెడతారు. ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ తెలిపిన వివరాల ప్రకారం, సూర్యుడి ఈ రాశి మార్పు వల్ల ఏకంగా ఐదు రాశుల వారికి అదృష్టం తలపు తట్టనుంది. అక్టోబర్ మధ్య నుంచి రాబోయే నెల రోజుల పాటు ఈ రాశుల వారి జీవితంలో సువర్ణావకాశాలు రానున్నాయి.

సూర్యుడు తులా ర...