Tirumala,andhrapradesh, ఆగస్టు 8 -- తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది.శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో జీడిప‌ప్పు ప్యాకింగ్‌కు వినియోగించిన ఖాళీ ప్లాస్టిక్ టిన్‌లను వేలం వేయనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ వెల్లడించింది.

ఆగ‌స్టు 13న రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ- వేలం వేయ‌నున్నట్లు టీటీడీ తెలిపింది. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని (0877-2264429)సంప్రదించవచ్చు. అంతేకాకుండా టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించాలని టీటీడీ పేర్కొంది.

పవిత్రమైన శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆగస్టు 9న తిరుమలలో గరుడ సేవ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ ప్రాంగణంలో విహరించి భక్తులను కటాక...