భారతదేశం, మే 24 -- తిరుమలకు వెళ్లేవారు చాలా మంది నేరుగా శ్రీవారి దర్శనం చేసుకుంటారు. కానీ స్వామివారి ఆలయం చుట్టూ అనేక ఇతర శక్తివంతమైన ఆలయాలు ఉన్నాయి. వాటికి చాలా చరిత్ర ఉంది. ఆ ఆలయాలన్నీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కథలతో ముడిపడి ఉన్నాయి. అటువంటి ఆలయాలలో ఒకటి వరాహస్వామి ఆలయం.

భూ వరాహస్వామి ఆలయం అని కూడా పిలిచే శ్రీ వరాహస్వామి ఆలయం తిరుమల కొండపై ఉంది. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిక్కున, స్వామి పుష్కరిణికి వాయవ్య మూలలో ఉంటుంది. ఈ ఆలయం వెంకటేశ్వర ఆలయం కంటే పురాతనమైనది.

హిరణ్యాక్షుడనే రాక్షసుడి నుండి భూమిని రక్షించిన తరువాత వరాహ స్వామి (విష్ణువు అవతారం) ఈ కొండపై కొలువుదీరారు. ఈ కారణంగానే తిరుమల కొండలను 'ఆది వరాహ క్షేత్రం' అని పిలుస్తారు. కలియుగం ప్రారంభంలో వరాహ స్వామి తిరుమల కొండపై తన భూమిని విష్ణువు మరొక రూపమైన వెంకటేశ్వరునికి ఇచ్చార...