భారతదేశం, జూలై 10 -- తిరుపతి నగరాన్ని వాతావరణ మార్పులను తట్టుకునేలా(Climate-resilient), సాంప్రదాయ చెరువులు, జలాశయాల పునరుద్ధరణ ద్వారా "సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్"గా మార్చేందుకు ప్రతిపాదించిన రూ.750 కోట్ల భారీ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. నగరంలో వరద ముంపు నివారణా చర్యలను బలోపేతం చేయడం కూడా ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (TUDA) ఈ 'క్లైమేట్ రెసిలియంట్ ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్‌మెంట్ ఇన్ తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ ఏరియా' ప్రాజెక్టును ప్రతిపాదించింది. తిరుపతిలోని చారిత్రాత్మక చెరువులు, కుంటలు, సహజ పారుదల కాలువల నెట్‌వర్క్‌ను పునరుద్ధరిస్తూ, పర్యావరణహిత పట్టణాభివృద్ధిని ప్రోత్సహించడమే దీని లక్ష్యమని పురపాలక పరిపాలన, పట...