భారతదేశం, ఏప్రిల్ 13 -- హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ మీద కొన్ని రోజుల క్రితం తల్లీబిడ్డలు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. వీరి ఆత్మహత్యలపై ఎంతోమంది రకరకాలుగా విశ్లేషణ చేశారు. ఒంటరిగా ఉండటం వలన విజయారెడ్డి సూసైడ్ చేసుకునేవైపు ఆలోచనలు చేసిందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా పిల్లల జీవితాలను అన్యాయం చేశారని కూడా కొందరు వ్యాఖ్యలు చేశారు.

ఇవన్నీ పక్కనపెడితే.. తాజాగా ఈ కేసు మరో మలుపు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అసలు ఈ ముగ్గురి ఆత్మహత్యలకు గల కారణం మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఎందుకు చనిపోయారు? అనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. కేసు దర్యాప్తులో లోపాలు ఉన్నాయంటూ కూడా విమర్శలు వచ్చాయి. రైల్వే పోలీసులను సైతం ప్రలోభాలకు గురి చేశారని ఆరోపణలు చేశారు కొందరు. ఇలాంటి సమయంల...