భారతదేశం, జనవరి 20 -- తమిళనాడు రాజకీయాల్లో మంగళవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రతి ఏటా మొదటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగించడం ఆనవాయితీ. అయితే, గవర్నర్ ఆర్.ఎన్. రవి తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. వరుసగా మూడో ఏడాది కూడా ఆయన ఇలా ప్రసంగాన్ని బహిష్కరించడం గమనార్హం.
ఉదయం 9:30 గంటలకు సభ ప్రారంభం కాగానే, స్పీకర్ ఎం. అప్పావు గవర్నర్ను ఉద్దేశించి.. కేబినెట్ ఆమోదించిన ప్రసంగ పాఠాన్ని మాత్రమే చదవాలని, రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కోరారు. దీనిపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
"నా ప్రసంగాన్ని అడ్డుకోవడం దురదృష్టకరం. జాతీయ గీతానికి తగిన గౌరవం ఇవ్వడం లేదు. నా మైక్ను కూడా పదే పదే స్విచ్ ఆఫ్ చేస్తున్నారు" అని గవర్నర్ సభలోనే ఆరోపించారు. ఆ వెంటనే ఆయన తన ప్రసంగాన్ని పూర్తి చేయకుండానే సభ నుంచి న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.