భారతదేశం, సెప్టెంబర్ 11 -- శుక్రవారం (సెప్టెంబరు 11) దేశీయ రిటైల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాల నేపధ్యంలో బులియన్ మార్కెట్‌లో ధరలు దిగొచ్చాయి.

అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు ఊహించిన దానికంటే ఎక్కువగా నమోదు కావడం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం అంతర్జాతీయ మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. వచ్చేవారం ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు బలపడ్డాయి. మరోవైపు యూఎస్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

"ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచడం, యుద్ధం ప్రారంభించడం వల్ల మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండేవాడిని," అని ఫాక్స్ న్యూస్ యాంకర్ లారా ఇంగ్రాహమ్‌తో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనా...