భారతదేశం, జూలై 20 -- ఢిల్లీ వీధులు విద్యార్థుల నినాదాలతో హోరెత్తాయి. నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పటిష్టమైన పోలీసు బందోబస్తు, లాఠీఛార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగాలను సైతం లెక్కచేయకుండా విద్యార్థులు, నిరసనకారులు తమ పోరాటాన్ని కొనసాగించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు.

పార్లమెంట్ వీధి వైపు దూసుకుపోతున్న నిరసనకారులను పోలీసులు బహుళ అంచెల బారికేడ్లతో అడ్డుకున్నారు. రాజధాని నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. పోలీసులు ఎంతగా అణచివేసేందుకు ప్రయత్నించినా వెనకడుగు వేసేది ల...