భారతదేశం, జూలై 4 -- పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జీవ ఇంధన (బయోఫ్యూయల్) రంగంలో మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమైంది. పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్ విజయవంతం కావడంతో, ఇప్పుడు డీజిల్‌లోనూ 15 శాతం వరకు ఐసోబ్యూటనాల్‌ను కలపడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.

పెట్రోల్‌లాగా ఇథనాల్‌ను డీజిల్‌లో నేరుగా కలపడం సాధ్యం కాదు. ఈ సాంకేతిక ఇబ్బందిని అధిగమించడానికి శాస్త్రవేత్తలు ఇథనాల్‌ను ఐసోబ్యూటనాల్‌గా మారుస్తున్నారు. డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా ఐసోబ్యూటనాల్ అద్భుతంగా పనిచేస్తుందని నితిన్ గడ్కరీ వివరించారు.

"మేము ఇప్పటికే రెండు జనరేటర్ సెట్లను 100 శాతం ఇథనాల్, ఐసోబ్యూటనాల్‌లతో విజయవంతంగా నడిపించాం. ఈ ఇంధనాలతో నడిచేలా సరికొత్త ఇంజ...