భారతదేశం, జూలై 26 -- YS Jagan Demands Nara Lokesh Resignation : రాష్ట్రంలో డీఎస్సీ (DSC) పరీక్షల నిర్వహణ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలు, వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.

నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీ ఉదంతానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారని జగన్ గుర్తుచేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ (NDA) కూటమి ప్రభుత్వంలో ఇది నైతికతకు, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొన్నారు. కేంద్రం...