భారతదేశం, ఆగస్టు 27 -- తెలంగాణ క్రీడారంగానికి భారీ ప్రోత్సాహం లభించింది. ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 8వ ఎడిషన్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించింది. డిసెంబర్ 2026లో ఈ మెగా క్రీడోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలను పోటీలకు వేదికలుగా ఎంపిక చేశారు.

ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి దాదాపు 6,000 మందికి పైగా యువ అథ్లెట్లు పాల్గొననున్నారు. మొత్తం 25 రకాల క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. వీటితో పాటు ఒక స్థానిక సంప్రదాయ క్రీడను ప్రతిపాదించే అవకాశాన్ని తెలంగాణకు కల్పించారు. అలాగే మరో కొత్త క్రీడా విభాగాన్ని కూడా ఈ ఎడిషన్‌లో కొత్తగా పరిచయం చేయనున్నారు.

ఈ క్రీడల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 21.1...