భారతదేశం, ఏప్రిల్ 28 -- తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత మొదలై, మధ్యాహ్నానికి నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఇలాంటి సమయంలో కేవలం గొంతు ఎండిపోయినప్పుడు నీళ్లు తాగడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వడదెబ్బ (Heatstroke) అనేది అకస్మాత్తుగా వచ్చేది కాదని, మన శరీరంపై రోజువారీగా పడే వేడి ప్రభావం ఒక స్థాయికి చేరినప్పుడు అది ప్రాణాంతకంగా మారుతుందని ముంబైలోని హీరానందని హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ విమల్ పహూజా విశ్లేషించారు.

వడదెబ్బ అనేది ఒకే రోజులో సంభవించే ప్రమాదం కాదు. రోజురోజుకూ శరీరంలో పేరుకుపోయే ఉష్ణోగ్రత ఒత్తిడి దీనికి కారణం. దీన్ని నివారించడానికి డాక్టర్ పహూజా మూడు సులభమైన సూత్రాలను ప్రతిపాదించారు:

శరీరానికి నీరు అందించడం (Hydration) లో మనం చేసే చిన్న ...