భారతదేశం, జూలై 14 -- అమెరికాలో నివసిస్తున్న ఐటీ ఉద్యోగులకు, తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన హెచ్-1బీ వీసాదారులకు ఇదొక పెద్ద హెచ్చరిక. చిన్న పొరపాటే కదా అని ట్రాఫిక్ జరిమానాలను లైట్ తీసుకుంటే, ఏకంగా వీసా రద్దయి స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. 600 డాలర్ల ట్రాఫిక్ ఫైన్ సకాలంలో చెల్లించకపోవడంతో ఒక ఉద్యోగి హెచ్-1బీ వీసా రద్దయిన ఉదంతం ఇప్పుడు ఎన్‌ఆర్‌ఐ వర్గాల్లో కలకలం రేపుతోంది.

లింక్డ్‌ఇన్ వేదికగా షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రకారం.. బాధితుడు అమెరికాలో ఒక ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘించాడు. దీనిపై కోర్టుకు కూడా హాజరయ్యాడు. అక్కడ జడ్జి అతనికి 600 డాలర్ల (సుమారు రూ. 50,000) జరిమానా విధించారు. అయితే, ఆ తర్వాత అతను కొత్త అపార్ట్‌మెంట్‌కు మారాడు. దాంతో కోర్టు నుంచి వచ్చిన తదుపరి నోటీసు అతనికి అందలేదు. ఫలితంగా గడువు ముగిసినా జరిమానా చెల్లి...