భారతదేశం, ఏప్రిల్ 24 -- ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్ వరకు ప్రతిపాదిత 7.1 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌పై అప్డేట్ వచ్చింది. జాతీయ రహదారి-65పై ప్రయాణించే లక్షలాది మంది ప్రయాణికులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

ఎల్బీ నగర్-హయత్‌నగర్ ప్రాజెక్టు పురోగతిని అంచనా వేయడానికి మంత్రి సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సర్వీస్ రోడ్లు, జాతీయ రహదారి, మెట్రో రైలు మౌలిక సదుపాయాల కనెక్టివిటీ, వెడల్పాటి పిల్లర్ల రూపకల్పన, మెట్రో నిర్మాణాలు, స్టేషన్లతో అనుసంధానం వంటి కీలక అంశాలను కూడా సమీక్షించారు.

నాగ్‌పూర్ తర్వాత భారతదేశంలోనే అతిపెద్ద డబుల్ డెక్కర్ కారిడార్ అభివృద్ధి ప్రాజెక్టులలో ఇది ఒకటి అవుతుందని వెంకట్ రెడ్డి అన్నారు. ఈ మార్గంలో తరచుగా జరుగుతున్న ప్రమాదాలపై ఆయన ఆందోళన వ్యక్...