భారతదేశం, జూలై 13 -- మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతున్న తరుణంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుండి వెలువడే ప్రభుత్వ పత్రిక 'హమ్‌షాహ్రీ' (Hamshahri) ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణానికి కారణమైన 13 మంది విదేశీ రాజకీయ, సైనిక నాయకులను లక్ష్యంగా చేసుకోవాలంటూ వారి ఫోటోలతో కూడిన ఇన్ఫోగ్రాఫిక్‌ను ఈ పత్రిక విడుదల చేసింది.

అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన కుమారుడు అయాతొల్లా మొజ్తబా ఖమేనీ తొలిసారి బహిరంగంగా స్పందించిన కొద్దిసేపటికే ఈ జాబితా వెలుగులోకి వచ్చింది.

"ప్రతికారం అనేది మా జాతీయ సంకల్పం, దీనిని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. మా లిస్టులో ఉన్న ఈ నేరస్థులు, తమ పడకలప...