భారతదేశం, జనవరి 22 -- ఆంధ్రప్రదేశ్లో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఘటనలు మరిచిపోకముందే.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో బస్సులో ఉన్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పూర్తి వివరాళ్లోకి వెళ్తే..
నెల్లూరు నుంచి హైదరాబాద్కు ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెళ్తోంది. ఇందులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శిరివెళ్లమెట్ట దగ్గరకు బస్సు వచ్చింది. ఈ సమయంలో బస్సు టైరు పేలింది. అంతేకాదు అదుపుతప్పి డివైడర్ దాటి అవతలివైపు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే బస్సుకు మంటలు వ్యాపించాయి. ఆ దారిలో వెళ్తున్న డీసీఎం డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యారు. బస్సు అద్దాలను పగలగొట్టారు. దీంతో ప్రయాణికులు ప్రా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.