భారతదేశం, జూన్ 9 -- భారత ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. రాబోయే మూడేళ్లలో దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లో పని చేసే ఉద్యోగుల సంఖ్యకు సమానంగా ఏఐ ఏజెంట్లు (AI Workers) అందుబాటులోకి రాబోతున్నారని కంపెనీ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సంచలన అంచనా వేశారు. అయితే, ఈ సాంకేతిక మార్పు వల్ల ఉద్యోగులను తొలగించే ఆలోచనేదీ కంపెనీకి లేదని, కాకపోతే కొత్త పాత్రల కోసం చేపట్టే నియామకాల ప్రక్రియ కొంత మందగిస్తుందని ఆయన వివరించారు.

కంపెనీ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో (AGM) చంద్రశేఖరన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్గత కార్యకలాపాలు, సొల్యూషన్ ఫ్రేమ్‌వర్క్‌లు, క్లయింట్ల ప్రత్యేక అవసరాల కోసం ఏఐ ఏజెంట్లను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి టీసీఎస్ భారీగా పెట్టుబడులు పెడుతోందని ఆయన వెల్లడించారు.

"రాబోయే ...