భారతదేశం, ఏప్రిల్ 15 -- పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. విధేయత, కష్టపడే తత్వం, అనుభవాన్ని లెక్కలోకి తీసుకుని పదవులు ఇచ్చినట్టుగా అధిష్టానం వెల్లడించింది. పనిచేసేవారికే పార్టీలో పెద్దపీట అన్న సంకేతాన్ని ఇచ్చింది. మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పచెప్పారు.

మంత్రి నారా లోకేష్‌ను టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. తనదైన వ్యూహాలతో క్యాడర్‌లో ఉత్సాహం నింపుతున్న లోకేష్‌కు ఈ బాధ్యత అప్పగించడం ద్వారా పార్టీ భవిష్యత్తు బాగుంటుందని కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు మరోసారి నియమితులయ్యారు. సీనియర్లకు గౌరవం, కొత్తవారికి అవకాశాలు, సామాజిక కోణంలో నూతన కమిటీల కూర్పు జరిగినట్టు తెలుస్తోంది.

29 మందిత...