భారతదేశం, జూలై 14 -- టీటీడీలోని వివిధ ట్రస్టులు, స్కీమ్‌ల‌కు విరాళాలు అందించే దాత‌ల‌కు క‌ల్పిస్తున్న ప్రివిలేజెస్‌లో ప‌లు మార్పులు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. తిరుమ‌ల‌లోని అన్నమ‌య్య భ‌వ‌నంలో టీటీడీ బోర్డు స‌మావేశం జ‌రిగింది. అనంత‌రం ఈవో ముద్దాడ ర‌విచంద్రతో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ.. విరాళాల నిర్వహణలో మరింత పారదర్శకత, ఏకరీతి (యూనిఫార్మిటీ) తీసుకురావడానికి టీటీడీకి చెందిన అన్ని ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పించే ప్రివిలేజెస్‌లో పలు మార్పులు చేపట్టామ‌న్నారు. ఈ కొత్త నిబంధనలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయ‌ని తెలిపారు. అయితే, ఇప్పటికే వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించిన దాతలకు ప్రస్తుతం అమలులో ఉన్న ప్రివిలేజెస్ యథావిధిగా కొనసాగుతాయ‌ని ...