Telangana,hyderabad, సెప్టెంబర్ 24 -- గ్రూప్ 1 కేసులో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ పై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది. జనరల్ ర్యాంకింగ్ లిస్టులను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. తదుపరి విచారణను అక్టోబర్ 15వ తేదీకి వాయిదా వేసింది. దీంతో టీజీపీఎస్సీతో పాటు ర్యాంకర్లకు తాత్కాలికంగా ఊరట లభించినట్లు అయింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....