భారతదేశం, జూన్ 11 -- భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త సంచలనానికి టాటా మోటార్స్ సిద్ధమైంది. దేశీయ మార్కెట్లో ఒకప్పుడు క్లాసిక్ హిట్‌గా నిలిచిన 'సియెర్రా' బ్రాండ్‌ను సరికొత్త ఎలక్ట్రిక్ అవతారంలో పునరుద్ధరిస్తూ.. ప్రొడక్షన్ మోడల్ సియెర్రా ఈవీ (Tata Sierra EV) ని జూన్ 30, 2026న మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఈ కారును 2020 ఆటో ఎక్స్‌పోలో మొదటిసారి కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించారు. ఆ తర్వాత 2023 ఆటో ఎక్స్‌పోలో మరిన్ని అప్‌డేట్లతో ప్రదర్శించగా, భారత ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (SUV) విభాగంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో ఒకటిగా ఇది నిలిచింది. గత ఏడాది (2025) చివర్లో దీని సాధారణ ఇంధన (ICE) వెర్షన్‌తో పాటు ఎలక్ట్రిక్ వెర్షన్ టీజర్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. సియెర్రా లుక్‌ను అలాగే ఉంచుతూనే, భవిష్యత్ ఈవీ టెక్నాలజీకి...