భారతదేశం, మే 29 -- భారతీయ చలనచిత్ర పరిశ్రమకు 2026 వ సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా మారనుంది. బాలీవుడ్‌లో 'ధురంధర్ 2' భారీ విజయంతో అకౌంట్ ఓపెన్ చేయగా.. రాబోయే రోజుల్లో 'రామాయణ', 'ఆల్ఫా', 'కింగ్' వంటి చిత్రాలు బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతున్నాయి. టాలీవుడ్ నుండి రామ్ చరణ్ 'పెద్ది', శాండల్‌వుడ్ నుండి యష్ 'టాక్సిక్', కోలీవుడ్ నుండి విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' లైన్‌లో ఉన్నాయి.

అయితే ఈ భారీ సూపర్ స్టార్ల చిత్రాలన్నింటినీ వెనక్కి నెట్టి ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ అవేటెడ్ మూవీగా ఒక సింపుల్ రొమాంటిక్ డ్రామా నిలవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మే 29 నాటి గణాంకాల ప్రకారం.. ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన 'మై వాపస్ ఆవుంగా' (Main Vaapas Aaunga) సినిమా IMDb మోస్ట్ అవేటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాలో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుం...