భారతదేశం, జూన్ 1 -- దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జోసా (JoSAA) 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్ josaa.nic.in లో పూర్తి వివరాలను అందుబాటులో ఉంచింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced 2026) లో ర్యాంకు సాధించిన విద్యార్థులు ఐఐటీ సీట్ల కోసం, జేఈఈ మెయిన్స్ అర్హులు ఎన్‌ఐటీ సీట్ల కోసం రేపటి (జూన్ 2) నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియకు దరఖాస్తు చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్ మరియు వెబ్ ఆప్షన్ల (Choice filling) ప్రక్రియ జూన్ 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ఎంచుకోవడానికి జూన్ 11వ తేదీ వరకు గడువు ఇచ్చారు. జూన్ 7 నాటికి విద్యార్థులు నమోదు చేసుకున్న ఆప్షన్ల ఆధారంగా జూ...