భారతదేశం, ఆగస్టు 31 -- ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. పాల ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా కృత్రిమ పదార్థాలతో తయారయ్యే అనలాగ్ డైరీ ఉత్పత్తులపై జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రకటించింది. తమ ప్లాట్‌ఫామ్‌పై అనలాగ్ పనీర్‌తో చేసే వంటకాల విక్రయాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.

రెస్టారెంట్ భాగస్వాములు తమ వంటకాల్లో అనలాగ్ పదార్థాలు వాడుతున్నట్లు స్పష్టం చేసిన ఐటెమ్‌లను ప్లాట్‌ఫామ్ నుంచి జొమాటో ఇప్పటికే తొలగించింది. రెస్టారెంట్లు వెంటనే అసలైన సహజసిద్ధమైన డైరీ ఉత్పత్తులకు మారాలని, వెంటనే మారడం సాధ్యం కాని పక్షంలో ఆయా వంటకాలను మెనూ నుంచి తొలగించాలని ఆదేశించింది. తమ సప్లయర్లు అందించే ఉత్పత్తుల లేబుళ్లు, పదార్థాల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని రెస్టారెంట్లకు సూచించిం...