భారతదేశం, జూలై 22 -- నీట్ పేపర్ లీక్ వివాదం పార్లమెంట్‌ను, ఢిల్లీ వీధులను ఊపేస్తోంది. బుధవారం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు నీట్ అంశంపై చర్చకు పట్టుబట్టాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం చర్చకు సిద్ధమని చెబుతున్నప్పటికీ, అడ్జర్న్‌మెంట్ మోషన్ ద్వారానే సమగ్ర చర్చ జరగాలని ప్రతిపక్షాలు స్పష్టం చేయడంతో పార్లమెంట్‌లో స్థంబన కొనసాగుతోంది.

మరోవైపు, జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శనలు చేపడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP), కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసంలో చర్చలకు రావాలన్న పోలీసుల ఆహ్వానాన్ని బహిరంగంగా తిరస్కరించింది.

నీట్ పేపర్ లీక్‌పై ప్రాధాన్యత ఇచ్చి అడ్జర్న్‌మెంట్ మోషన్ కిందే చర్చ జరపాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా డిమాండ్ చేశారు. "మేము చర్చకు వ్యతిరేకం కాదు, అయితే వాయిదా తీర్మానం ద్వారా చర్చ జరిగితేనే ఈ సున్నితమైన అంశంపై పూర్తి స్థా...