భారతదేశం, జూలై 24 -- జూలై 28, 29 తేదీలలో జరగనున్న సింహాచలం గిరి ప్రదక్షిణకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వారిని నియంత్రించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత జన సమూహ పర్యవేక్షణ, సీసీటీవీ నిఘాను ఏర్పాటు చేయనున్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాట్లను సమీక్షించిన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. అభిషక్త కిషోర్.. ట్రాఫిక్ నిర్వహణ, భద్రత, తాగునీరు, వైద్య సేవలు, పారిశుధ్యం, విద్యుత్, రవాణా కోసం సమన్వయ ఏర్పాట్లు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 32 కిలోమీటర్ల ఈ ప్రదక్షిణకు ఐదు నుంచి ఆరు లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా.

ఈ మార్గాన్ని ఏడు జోన్లుగా, 28 సెక్షన్లుగా విభజించి, పోలీసు, జీవీఎంసీ అధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. జూలై 27 నుండి జూలై 29 ఉదయం వరకు ఆరు షిఫ్టులలో విధులు నిర్వహిస్తారు. ఒక సెంట్రల్ కమాండ్, ...