భారతదేశం, జూలై 26 -- హైదరాబాద్ ఉప్పల్ జంక్షన్ వద్ద జరుగుతున్న గ్రేడ్ సెపరేటర్ నిర్మాణ పనులను వేగవంతం చేయనున్నారు. ఇందులో భాగంగా అక్కేడే పైప్‌లైన్ జంక్షన్ పనులు చేపట్టనున్నారు. దీనివల్ల జూలై 27న ఉదయం 10 గంటల నుండి నగరంలోని అనేక ప్రాంతాల్లో 24 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది.

ఈ పనులు కృష్ణా తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ (KWSP) ఫేజ్-II రింగ్ మెయిన్-2కు సంబంధించిన 1,600 మి.మీ వ్యాసం కలిగిన ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్‌కు సంబంధించినవని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWS&SB) తెలిపింది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ నిర్మిస్తున్న ఉప్పల్ ఫ్లైఓవర్ పీ15 ఫౌండేషన్ నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ఈ జంక్షన్ పనులు చేపడుతున్నారు.

ఉప్పల్ జంక్షన్ నుండి వరంగల్ హైవే వైపు వెళ్లే రహదారి మూసివేసినందున ఈ పనులు అవసరమని, ఫౌ...