భారతదేశం, జూలై 14 -- రైలు టికెట్ బుక్ చేసుకునే సమయంలో సర్వర్ డౌన్ కావడం, పేజీ లోడ్ కావడానికి గంటల తరబడి సమయం పట్టడం వంటి ఇబ్బందులకు త్వరలోనే చెక్ పడనుంది. ప్రయాణికులకు మరింత సులువైన, వేగవంతమైన సేవలను అందించేందుకు వీలుగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారు. జూన్ 11న రాజస్థాన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి ఈ నూతన వెబ్‌సైట్ లాంచ్ వివరాలను వెల్లడించారు.

ముఖ్యంగా జైపూర్‌లోని ఎంఎన్‌ఐటీ (MNIT) విద్యార్థి ఒకరు వెబ్‌సైట్‌లోని 'క్యాప్చా' (CAPTCHA) వెరిఫికేషన్ ప్రక్రియ వల్ల టికెట్ బుకింగ్ ఆలస్యమవుతోందని మంత్రికి వివరించారు. ఈ సమస్యలన్నింటినీ అధిగమిస్తూ సరికొత్త వెబ్‌సైట్‌ను సిద్ధం చేశారు.

కొత్త వెబ్‌సైట్‌లో అతిపెద్ద మ...