భారతదేశం, జూన్ 16 -- రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్, అలాగే కర్ణాటకలోని ఎస్ఎంవీటీ బెంగళూరు మార్గాల్లో ప్రత్యేక వారంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ప్రత్యేక సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రత్యేక రైళ్ల సమయాలు, సర్వీసుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రైలు నంబరు 08508 (విశాఖపట్నం - షాలిమార్) ప్రతి మంగళవారం ఉదయం 11:20 గంటలకు విశాఖపట్నం నుంచి ఈ రైలు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 3:00 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది. జూలై 7 నుంచి సెప్టెంబర్ 29 వరకు మొత్తం 13 ట్రిప్పుల పాటు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.

తిరుగు ప్రయాణంలో రైలు నంబరు 08507 (షాలిమార్ - విశాఖపట్నం) ప్ర...