భారతదేశం, జూన్ 2 -- తెలంగాణలో ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ అత్యంత తీపి కబురు అందించింది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో భానుడు సృష్టిస్తున్న భీభత్సానికి త్వరలోనే బ్రేక్ పడనుంది. గురువారం నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకడానికి పూర్తి అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం (IMD) అంచనా వేసింది.

రుతుపవనాల రాకతో పాటు రాష్ట్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణుల ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం, నైరుతి రుతుపవనాల గమనం ఆశాజనకంగా ఉంది. ఇవి గురువారం నాటికి కేరళలో ప్రవేశిస్తే, అక్కడ నుంచి వారం రోజులలోపు, అంటే జూన్ రెండో వారంలోగా ఇవి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ర...