భారతదేశం, జూలై 1 -- వేసవి కాలం నాటి తీవ్రమైన ఎండల నుంచి ఈ వాతావరణం ఎంతో ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ, ఆరోగ్య పరంగా మాత్రం అనేక సవాళ్లను తెచ్చిపెడుతుంది. ఉదయం లేవగానే చిరుజల్లులు, మధ్యాహ్నానికి ఉక్కపోత, రాత్రికి భారీ వర్షం - ఇలాంటి అస్థిరమైన వాతావరణం వల్ల మన శరీరం ఒక్కసారిగా గందరగోళానికి గురవుతుంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు ప్రతి గ్రామంలోనూ, నగరాల్లోని కాలనీల్లోనూ జ్వరాలు, దగ్గు, జలుబు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పాఠశాలలకు వెళ్లే చిన్న పిల్లల నుంచి ఆఫీసులకు వెళ్లే పెద్దల వరకు అందరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రుల వెలుపల ఓపీ లైన్లు పెరుగుతున్న ఈ తరుణంలో, ఈ మార్పులను కేవలం సాధారణ మార్పులుగా భావించి సరిపెట్టుకోలేము. జులై, ఆగస్టు నెలల్లో వచ్చే వాతావరణ మార్పుల వెనుక దాగున్న అసలు ఆరోగ్య ముప్పులేమిటో, వాటి న...