భారతదేశం, జూలై 5 -- హైదరాబాద్ మహానగర పరిధిలో పరిపాలనను మరింత బలోపేతం చేసేందుకు, సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రభుత్వం 'కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు, 2026' ముసాయిదాను ప్రజల సలహాలు, సూచనల కోసం విడుదల చేసింది.

ఈ కొత్త బిల్లు ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఒకే సమగ్ర పాలనా వ్యవస్థ(ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ సిస్టమ్) కిందికి తీసుకురానున్నారు. కార్పొరేషన్ స్థాయిలో వికేంద్రీకృత పరిపాలనను కొనసాగిస్తూనే, మెట్రో స్థాయిలో మెరుగైన సమన్వయం సాధించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.

గతంలో 15 లక్షల జనాభా ఉన్నప్పటి అవసరాల కోసం 'గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, 1955' ను తీసుకువచ్చారు. అయితే ప్రస్తుతం ఈ ...