భారతదేశం, ఫిబ్రవరి 20 -- పారిశుధ్య ప్రమాణాలను మెరుగుపరచడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) జపాన్ తరహా వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం ప్రయత్నాలు చేస్తోంది. చెత్తను ఉపయోగపడే వనరులుగా మార్చే సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి అధికారులు ఒక ప్రతిపాదనను రూపొందించారు. రంగారెడ్డి జిల్లాలోని సిద్ధాపూర్‌లోని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TSIIC) భూమిలో 86 ఎకరాల ఎకో-టౌన్ ప్రాజెక్ట్ ప్రతిపాదన ఉంది. భూమి కేటాయింపు పూర్తయిన తర్వాత పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

ప్రభుత్వ-ప్రైవేట్ పార్టనర్‌షిప్ మోడల్‌లో ఈ ప్రాజెక్ట్ అమలు కానుంది. వ్యర్థాలు బయటకు పోకుండా నిరోధించడానికి మొత్తం ఎకోటౌన్‌ ప్రాంతాన్ని కంటైనర్ తరహాలో నిర్మాణం చేస్తారు. తడి వ్యర్థాలను కంపోస్ట్‌గా మారుస్తారు, పొడి వ్యర్థ...