భారతదేశం, జూన్ 17 -- ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTUA) అనంతపురం ఒక సువర్ణావకాశాన్ని తీసుకొచ్చింది. జర్మనీకి చెందిన ప్రముఖ 'రైట్లింగెన్ నాలెడ్జ్ ఫౌండేషన్ యూనివర్సిటీ'తో జెఎన్‌టియూఏ కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 2026-27 విద్యాసంవత్సరం నుండి ఈ ఇంటిగ్రేటెడ్ B.Tech-MS కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ అంతర్జాతీయ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులు ఒకే సమయంలో JNTUA, జర్మన్ విశ్వవిద్యాలయం నుండి డ్యూయల్ డిగ్రీలను పొందే అవకాశం లభిస్తుంది.

ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కింద విద్యార్థులు తమ మొదటి నాలుగేళ్ల చదువును జేఎన్‌టీయూ అనంతపురంలో పూర్తి చేస్తారు. ఆపై చివరి (ఐదో) సంవత్సరాన్ని జర్మనీలో చదవాల్సి ఉంటుంది. సాధారణంగా B.Tech, MS పూర్తి చేయడానికి ఆరేళ్లు పడుతుంది. కానీ ఈ విధ...