భారతదేశం, ఆగస్టు 7 -- న్యూఢిల్లీ: తెలంగాణలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్ఎస్) కోరింది. ఈ మేరకు ఢిల్లీలో గురువారం డీజేహెచ్ఎస్ అధ్యక్షులు బొల్లోజు రవి, డైరెక్టర్ ప్రతాపరెడ్డి, సభ్యులు నవీన్ దుమ్మాజీ, సతీష్ యాదవ్ తదితరులు ఆయన నివాసంలో కలిశారు. ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తామని గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎలాగైనా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని బొల్లోజు రవి, ప్రతాప్ రెడ్డి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన విషయాన్ని వారు సీఎంకు వివరించారు. కాగా... ఇళ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఉన్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ...