భారతదేశం, జూన్ 5 -- ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జరిగే జగన్నాథ రథయాత్ర ఆధ్యాత్మిక వైభవానికి నిలువెత్తు ప్రతిరూపంa. భక్తజన సంద్రం మధ్య తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా సాగే ఈ ఉత్సవాన్ని రథోత్సవం లేదా శ్రీ గుండిచా యాత్ర అని కూడా పిలుస్తారు. ప్రధాన జగన్నాథ ఆలయం నుంచి గుండిచా దేవి మందిరం వరకు ఈ రథయాత్ర సాగుతుంది.

జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర దేవిలకు అంకితమైన ఈ పవిత్ర వేడుకను ప్రతి ఏటా ఆషాఢ మాస శుక్ల పక్ష విదియ తిథి నాడు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో భాగంగా ముగ్గురు దేవతామూర్తులను భారీ, సుందరమైన రథాలపై ప్రతిష్ఠించి నగర వీధుల్లో ఊరేగిస్తూ గుండిచా ఆలయానికి తరలిస్తారు. ఈ గుండిచా మందిరాన్ని స్వామివారి మేనత్త ఇల్లుగా భక్తులు భావిస్తారు.

హిందూ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర 2026 జూలై 16, గురువారం నాడు ప్రారంభం కానుంది...