భారతదేశం, జూలై 16 -- ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జగన్నాథుడి రథయాత్ర అంటేనే భక్తి పారవశ్యం. లోక బాంధవుడు తన సోదర, సోదరీమణులతో కలిసి భక్తులకు దర్శనమిచ్చే ఈ మహోత్సవం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. అయితే, ఈ రథయాత్రకు సంబంధించి చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన, భావోద్వేగపూరితమైన ఘట్టం 'హేరా పంచమి'. స్వామివారు రథం ఎక్కి వెళ్తుంటే, అలిగిన లక్ష్మీదేవి రథాన్ని ధ్వంసం చేయడం వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

జగన్నాథ స్వామి రథయాత్ర జూలై 16న అనగా ఈరోజు అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. గర్భాలయం నుంచి బయటకు వచ్చిన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవి రథాలపై అధిరోహించి గుండిచా మందిరం (స్వామి మేనత్త ఇల్లు) వైపు సాగుతారు. భక్తుల జయజయధ్వానాల మధ్య, రథ చక్రాల చప్పుడుతో పూరీ పురమంతా మార్మోగిపోతుంది. ఈ రథయాత్ర కేవలం భక్తులకు దర్శనం ఇవ్వడమే కాదు, అనేక పురాణ గ...