Andhrapradesh, అక్టోబర్ 1 -- దసరా పండగ వేళ చిన్న కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2014-19 మధ్య పనులు చేసి సుదీర్ఘ కాలంగా బిల్లుల కోసం వేచిచూస్తున్న వారి బిల్లులను చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. రూ. 5 కోట్ల లోపు చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించనుంది.

కేవలం 2014 నుంచి 2019 వరకు మాత్రమే కాకుండా.. ఇప్పటి వరకు రూ. 5 లక్షల్లోపు చేపట్టిన పనులకూ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశంతో ఆర్థికశాఖ చెల్లింపుల ప్రక్రియ చేపట్టింది. ఆర్థిక శాఖ నిర్ణయంతో దాదాపు రూ.400 కోట్ల మేర వీరందరికీ లబ్ధి చేకూరనుంది.

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పటికే పలు దఫాలుగా నాటి పెండింగ్ బిల్లుల చెల్లింపులు చేస్తోంది. పండుగ సందర్భంగా బిల్లుల చెల్లింపుల ప్రక్రియ చేపట్టాలన్న ముఖ్యమంత్రి ఆదేశంతో ఆర్థిక శాఖ ఈ నిర్ణయం...