భారతదేశం, జూలై 9 -- జీవితంలో స్థిరత్వాన్ని కోరుకునే వారు ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. చేతిలో ఉన్నదాన్ని వదిలేసి, అందని ద్రాక్ష కోసం పరుగులు తీస్తే చివరకు మిగిలేది శూన్యమే. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రం నేటి ఆధునిక కాలానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

మహా పండితుడు, రాజనీతిజ్ఞుడు ఆచార్య చాణక్యుడు తన 'నీతి శాస్త్రం'లో మానవ జీవితంలోని లోతైన రహస్యాలను వివరించారు. ఆయన చెప్పిన విషయాలను పాటించడం వల్ల సామాన్యుడు కూడా అసాధారణ విజయాలు సాధించగలడు. ముఖ్యంగా సంపద, కెరీర్ విషయంలో ఆయన అందించిన హెచ్చరిక అక్షర సత్యం.

"యో ధ్రువాణి పరిత్యజ్య అధ్రువం పరిషేవతే।

ధ్రువాణి తస్య నశ్యంతి చాధ్రువం నష్టమేవ చ॥"

దీని అర్థం ఏంటంటే.. ఏ వ్యక్తి అయితే చేతిలో ఉన్న సురక్షితమైన దాన్ని వదిలేసి, అనిశ్చితమైన దాని కోసం పరుగులు తీస్తాడో, అతడు ఉన్నదాన్ని కూడా ...