భారతదేశం, ఆగస్టు 13 -- ప్రసిద్ధ వేలాంకణి మాత వార్షిక మహోత్సవాల నేపథ్యంలో ప్రయాణికులు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ పరిధిలోని నూతన టెర్మినల్ చర్లపల్లి నుండి వేలాంకణి మధ్య అదనపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా కేటాయించిన ఈ ప్రత్యేక రైళ్ల సమయ వేళలు, వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

చర్లపల్లి - వేలాంకణి (రైలు నంబరు: 07127): ఈ ప్రత్యేక రైలు సెప్టెంబరు 08, 2026 (మంగళవారం) ఉదయం 07:40 గంటలకు చర్లపల్లి స్టేషన్ నుండి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 09:10 గంటలకు వేలాంకణి చేరుకుంటుంది.

వేలాంకణి - చర్లపల్లి (రైలు నంబరు: 07128): తిరుగు ప్రయాణంలో ఈ రైలు సెప్టెంబరు 09, 2026 (బుధవారం) రాత్రి 11 గంటలకు వేలాంకణిలో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 10:15 గ...