భారతదేశం, మే 24 -- తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించేవారికి దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. చర్లపల్లి-తిరుచిరాపల్లి-చర్లపల్లి మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ నడుపుతోంది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడనుంది. ట్రైన్ నెంబర్ 17077 చర్లపల్లి నుంచి తిరుచిరాపల్లికి 07.07.2026 రోజున మంగళవారం బయల్దేరుతుంది. అలాగే ట్రైన్ నెంబర్ 17078 తిరుచిరాపల్లి నుంచి చర్లపల్లికి బుధవారం రోజున 08.07.2026 రోజున బయల్దేరుతుంది.

ఈ ట్రైన్లు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, వెల్లూరు కంటోన్మెంట్, తిరువణ్ణమలై, తిరుక్కోవిలూర్, విల్లుపురం, విరుధాచలం, అరియలూర్, శ్రీరంగం, తిరుచిరాపల్లి స్టేషన్లలో ఆగుతుంది.

తిరుపతి, హైదరాబాద్‌లోన...