భారతదేశం, ఆగస్టు 4 -- ఖగోళంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఆగస్టు నెల అద్భుతమైన మార్పులకు వేదికవుతోంది. ముఖ్యంగా రక్షాబంధన్ పండుగ జరుపుకునే ఆగస్టు 28న ఈ ఏడాదికి సంబంధించి చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ గ్రహణానికి సరిగ్గా ఎనిమిది రోజుల ముందు, అంటే ఆగస్టు 20న కర్మదాత శనిదేవుడు తన నక్షత్ర పదాన్ని మార్చబోతున్నాడు. జ్యోతిష్య నిపుణుల అంచనా ప్రకారం, శని గ్రహం రేవతి నక్షత్రం మొదటి పాదంలోకి ప్రవేశించనుంది.

27వ నక్షత్రమైన రేవతికి బుధుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. ఇలా బుధుడి నక్షత్రంలోకి శని ప్రవేశించడం వల్ల కొన్ని ప్రత్యేక రాశుల వారికి విపరీత రాజయోగం పట్టనుంది. నిలిచిపోయిన పనులు వేగవంతం కావడంతో పాటు, ఆర్థికంగా తిరుగులేని పురోగతి కనిపిస్తుందని పండితులు వెల్లడిస్తున్నారు. ఆ అదృష్ట రాశులు ఎవో ఇప్పుడు చూద్దాం.

వృషభ రాశి వారికి శని నక్షత్ర మార్పు అ...