భారతదేశం, ఫిబ్రవరి 14 -- తిరుమలకు చేపట్టిన 'సంకల్ప యాత్ర' పూర్తి అయిన సందర్భంగా సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని కలిశారు. యాత్ర పూర్తి అయిన తర్వాత శ్రీవారిని దర్శినం చేసుకున్న బండ్ల గణేశ్. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ను కూడా కలిశారు. వారికి శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. అయితే శుక్రవారం నారా భువనేశ్వరిని కుటుంబసమేతంగా కలిశారు.

"నవ్యాంధ్ర నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి శ్రీమతి భువనేశ్వరి గారిని కుటుంబ సమేతంగా కలిశాను. వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నాను. ప్రతి నిత్యం రాష్ట్ర ప్రజలకు అండగా, పార్టీ కార్యకర్తలకు అభిమానులకు నైతిక ధైర్యం అందించి తోడుగా నిలిచిన తల్లి భువనేశ్వరి నా సంకల్ప యాత్ర గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు" అంటూ బండ్ల గణేశ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

ఇక ముఖ్యమంత్రి చంద...