భారతదేశం, ఏప్రిల్ 30 -- మానవాళికి శాంతి సందేశాన్ని అందించిన గొప్ప మార్గదర్శకుడు గౌతమ బుద్ధుడు. నేపాల్లోని లుంబినిలో ఒక రాజకుటుంబంలో జన్మించిన సిద్ధార్థుడు, రాజభోగాలను తృణప్రాయంగా భావించి లోక కల్యాణం కోసం, సత్య అన్వేషణ కోసం ధ్యాన మార్గాన్ని ఎంచుకున్నారు. సిద్ధార్థుడు 'బుద్ధుడు'గా మారిన ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఆయన బోధనలు వేల ఏళ్ల క్రితం ఎంతటి ప్రభావం చూపాయో, నేటి వేగవంతమైన ప్రపంచంలోనూ అంతే ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.
బుద్ధుని ప్రధాన బోధనలలో అహింస అగ్రస్థానంలో ఉంటుంది. తన ప్రాణాలను కాపాడుకోవడానికి కూడా మరొక జీవికి హాని చేయకూడదని ఆయన ఉద్బోధించారు. మనసు ఎప్పుడైతే హింసకు దూరమవుతుందో, అప్పుడే మనిషిలోని దుఃఖం క్రమంగా అంతరిస్తుందని బుద్ధుడు నమ్మారు. ప్రతి ప్రాణి జీవించాలని కోరుకుంటుంది తప్ప మరణించాలని కాదు. మనం సుఖాన్ని ఆశించినట్లే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.