భారతదేశం, జూన్ 21 -- రాబోయే 2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుటి నుంచే పక్కా ప్రణాళికలతో సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పుష్కర ఘాట్ల సమీపంలో ఉన్న 162 దేవాలయాలను పునరుద్ధరించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది.

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారి రాహుల్ మీనాతో కలిసి కమిషనర్ రామచంద్రమోహన్ ప్రతిపాదిత మౌలిక సదుపాయాలు, ఆలయాల అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. పుష్కరాల కోసం వచ్చే కోట్లాది మంది భక్తులు ఘాట్లలో పవిత్ర స్నానాలు ఆచరించిన అనంతరం సమీపంలోని ఆలయాలను దర్శించుకుంటారని, అందుకే ఈ ప్రాంతాల్లో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

'గోదావరి ప్రాంతంలోని పుష్కర ఘాట్లకు సమీపంలో మొత్తం 543 దేవాలయాలను...