భారతదేశం, ఆగస్టు 17 -- కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో పంచాయతీ రాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న నూకరాజు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేధింపులు తట్టుకోలేక ఆయన, తన భార్య మీనా, కుమార్తె సౌజన్యతో కలిసి ఆదివారం రాత్రి రాజమహేంద్రవరంలోని రోడ్ కమ్ రైలు వంతెనపై నుంచి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే ఈ ఘటనలో నూకరాజు మనవడు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు.

కాకినాడలోని అశోక్ నగర్‌కు చెందిన నూకరాజు కుటుంబం కారులో రాజమహేంద్రవరం రోడ్-కమ్-రైలు వంతెన వద్దకు చేరుకుని రాత్రి 11.30 గంటల సమయంలో గోదావరిలోకి దూకారు. ఆ సమయంలో వంతెనపై నుంచి వెళ్తున్న ఒక వ్యక్తి గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు తక్షణమే స్పందించి, నదిలోని లంక గ్రామానికి చెందిన స్థానిక మత్స్యకారులను రంగంల...